ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణా సంస్థ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణా సంస్థ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. | కామారెడ్డి జిల్లా ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణా సంస్థ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎయిడ్స్ ను అరికట్టడంలో ప్రతి ఒక్కరు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఎయిడ్స్ వ్యాధి నివారణకు నిరంతరం పాటుపడాలని కోరారు. ఎయిడ్స్ ప్రాణాంతకమైన వ్యాధి కాదని, మందులు ఉన్నాయని వాటిని క్రమం తప్పకుండా వాడితే నివారణ చేయడం సులభమని పేర్కొన్నారు. |
01/12/2021 | 31/12/2021 | చూడు (558 KB) |