పోలీస్, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్, రోడ్డు రవాణా శాఖ అధికారులతో రోడ్డు భద్రత నియమాలపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్ష నిర్వహించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
పోలీస్, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్, రోడ్డు రవాణా శాఖ అధికారులతో రోడ్డు భద్రత నియమాలపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్ష నిర్వహించారు. | రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రజలు సురక్షితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం పోలీస్, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్, రోడ్డు రవాణా శాఖ అధికారులతో రోడ్డు భద్రత నియమాలపై సమీక్ష నిర్వహించారు. హెల్మెట్ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలలో అధిక మంది వ్యక్తులు మృత్యువాత పడుతున్నారని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ లేకుంటే తప్పనిసరిగా జరిమానాలు విధిస్తారని పేర్కొన్నారు. అతి వేగంగా వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని సూచించారు. జిల్లాలో పది చోట్ల ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ లను గుర్తించినట్లు చెప్పారు. |
12/01/2022 | 11/02/2022 | చూడు (443 KB) |