ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం కోసం చేపడుతున్న రోడ్డు పనులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు పరిశీలించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం కోసం చేపడుతున్న రోడ్డు పనులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు పరిశీలించారు. | సదాశివనగర్ మండలం లింగంపల్లి, జనగాం, తాడ్వాయి మండలం కరడ్ పల్లి గ్రామ శివారులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం కోసం చేపడుతున్న రోడ్డు పనులను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పరిశ్రమ ఏర్పాటు చేసే స్థలంలో జనగామ గ్రామానికి చెందిన పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, లింగంపల్లి కోతుల ఆహార కేంద్రం స్థలాలు వెళ్తున్నాయని ఆయా గ్రామాల సర్పంచులు శంకర్, సాయిలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. స్థలాలు పరిశ్రమ లోకి వెళ్లకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమ ఏర్పాటుతో పట్టా భూములు వెళ్లాయని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. పట్టాలు ఉన్న రైతులకు మరోచోట భూములను చూపించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. |
22/11/2021 | 21/12/2021 | చూడు (542 KB) |