ఆరోగ్య లక్ష్మి

తెలంగాణ ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే స్త్రీలు మరియు ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ పోషకమైన భోజనం అందిస్తుంది. ఈ పథకాన్ని జనవరి 1, 2015 న గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారికంగా ప్రారంభించారు. మహిళలకు 200 ఏం. ఎల్ పాలు 25 రోజులు మరియు ఒక గుడ్డు ప్రతి రోజు భోజనం ఇవ్వబడుతుంది. ఏడు నెలల నుంచి మూడేళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు 2.5 కిలోల ఆహార ప్యాకెట్తో పాటు నెలకు 16 గుడ్లు అందిస్తారు. 3 నుండి ఆరు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు, బియ్యం,పప్పు, కూరగాయలు మరియు స్నాక్స్ తో పాటు రోజుకు ఒక గుడ్డు సరఫరాచేయబడుతుంది. ఈ పథకం కింద సరఫరా చేయబడిన ఆహార పదార్థాల పరిమాణాన్ని అన్ని వర్గాలలో విస్తరించారు.
ఆరోగ్య లక్ష్మి ప్రోగ్రాం” యొక్క లక్ష్యాలు :
- గర్భిణీ మరియు పాలిచ్చే మహిళలచే అనుబంధ పోషణ యొక్క నాణ్యత మరియు ఆమోదయోగ్యతను మెరుగుపరచడం.
- సరఫరా చేయబడిన ఆహారాన్ని గర్భిణీ మరియు పాలిచ్చే స్త్రీలు మాత్రమే పూర్తి కుటుంబ సభ్యులు వినియోగిస్తున్నారని నిర్ధారించుకోడం.
- గర్భిణీ మరియు పాలిచ్చే మహిళలు 90+ IFA tablets ను వినియోగిస్తారని నిర్ధారించుకోడం.
- అంగన్వాడీసెంటర్స్ (ఎడబ్ల్యుసి) లో తల్లుల నమోదును మెరుగుపరచడం.
- రక్తహీనత ఉన్న / పోషకాహార లోపంతో ఉన్న గర్భిణీ మరియు పాలిచ్చే మహిళల సంఖ్యను తగ్గించడం.
- తక్కువ జనన శిశువులు మరియు పిల్లలలో పోషకాహార లోపం సంభవించకుండా చుస్కోడం.
- గర్భిణీ మరియు పాలిచ్చే స్త్రీలు ఆరోగ్య పరీక్షలు మరియు రోగనిరోధక శక్తిని పొందుతారని నిర్ధారించుకోడం.
- శిశు మరణాలు మరియు తల్లి మరణాలను తగ్గించడం.
లబ్ధిదారులు:
మహిళలు, పిల్లలు
ప్రయోజనాలు:
అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరు సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న గర్భిణీ స్త్రీలు మరియు చిన్నారులకు మరియు ప్రతిరోజూ ఒక పోషకమైన భోజనం
ఏ విధంగా దరకాస్తు చేయాలి
మరింత సమాచారం కోసం http://wdcw.tg.nic.in/Arogya_Lakshmi.html పై క్లిక్ చేయండి