ముగించు

మైనారిటీల సంక్షేమం

తెలంగాణా రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖా యొక్క ముఖ్యా ఉద్దేశము వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహయం అందించి అల్ప సంఖ్యాక వర్గాల వారి జీవన ప్రమాణమును మెరుగుపరుచుచూ, కామరెడ్డి జిల్లో 11 అక్టోబర్, 2016 సంవత్సరము నుండి పనిచేయుచున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారంగా జిల్లాలో 1,05,442 జనాభా మైనారిటీలు ఉన్నారు. అనగా ముస్లిములు 99572, క్రిస్టీయన్లు 4154, సిక్కులు 872, బౌద్ధలు 507 మరియు జైనులు 337 కలరు. మైనారిటీ వర్గములకు చెందిన అనగా ముస్లిములు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు, బౌద్ధలు మరియు పారషీకులకు చెందిన వారి అభ్యునతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వముల ద్వారా జిల్లాలో 2018-19 సం.లో ఈ క్రింద పథకము అములులో ఉన్నవి.

  1. బ్యాంకుల ద్వారా బూణములు: చదువుతో నిమిత్తము లేకుండా నిరుద్యోగులుగా ఉన్న వారికీ అనుభవం, అవగాహన్నుబట్టి చిన్నతరహపరిశ్రమలు, వ్యాపార సంస్థలు, కుటిర పరిశ్రమలు స్థాపించుటకోనుటకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయము అందించబడుచున్నది. స్కీం మొత్తం 80%, 70% మరియు 60% సబ్సిడీ అందించబడుచున్నది. http://tsobmms.cgg.gov.in ఆన్లైన్లో దరఖాస్తు చేసు కోవాలి.

వార్షిక ప్రణాళిక 2018-19

వ.సం. పథకము లక్ష్యం సాధించిన ప్రగతి
1 బ్యాంకు ద్వారా సబ్సిడీ బుణము 237 227.20 ఆన్ లైన్ ద్వార వచ్చిన దరఖాస్తు ల నుండి క్యాటగిరి – A లో18 మంది లబ్దిదారులకు 100% సబ్సిడీ ద్వార రూ. 8,20,000/- D.D. లు తయరు చేసి Municipal Commissioner & MPDOs ద్వార లబ్దిదారులకు అందజేయడం జరిగినది మరియు క్యాటగిరి – B లో219 మొత్తం 237 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ గారి ఆమొదము పొంది MFC కు మంజూరు కొరకు పంపనైనది.
  1. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటి (టి.ఎం.ఆర్.ఇ.ఐ.ఎస్) హైదరాబాద్:

అల్ప సంఖ్యకా బాలబాలికలకు గురుకుల పాఠశాలలను నెలకొలిపి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించుటకై ఏర్పరచిన స్వయం ప్రతిపత్తిగల ప్రత్యేక సంస్థ టి.ఎం.ఆర్.ఇ.ఐ.ఎస్.రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గములో ఒకటి మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో (2) పాఠశాలలు నేలకోల్పటం జరిగింది. ఈ విద్యసంవత్సరము 2017-18 లో మొదటి విడతగా (3) గురుకుల పాఠశాలలు (బాలుర కొరకు2, బాలికల కొరకు 1) నెలకొల్పబడింది మరియు మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను టి.యం.ఆర్.ఇ.ఐ.యస్. లోకి విలీనం చేయునైనది మొత్తం 6 పాఠశాలలు కామారెడ్డి జిల్లాలో ఎర్పాటు చేయనైనవి. అదేవిధంగా ప్రస్తుత సంవత్సరం 2020-21 నందు కొత్తగా బాలుర జూనియర్ కళాశాల ఎల్లారెడ్డి M.E.C, C.E.C,  బాలికల జూనియర్ కళాశాల బాన్సువాడ నందు (MPC, Bi.P.C) ఆంగ్ల మాధ్యము ద్వారా కోర్సులతో కామారెడ్డి జిల్లా కేంద్రము నందు ఏర్పటు చేయడం జరిగింది.

క్ర.సం. జిల్లా పేరు ప్రాంతం మంజూరు ఆయన స్కూల్ స్ట్రెంత్ ప్రవేశమైన విద్యార్థులు

 

రిమార్క్స్

1

 

 

 

కామారెడ్డి

 

బాన్సువాడ (జి) 480 480
2 ఎల్లారెడ్డి (బి) 240 240
3 కామారెడ్డి (జి) (కొత్త) 200 200
4 బిచ్కుంద (బి) (కొత్త) 400 369
5 లింగంపేట్ (బి) (కొత్త) 200 200
6 కామారెడ్డి (బి) (విలీనం) 480 375
7 కామారెడ్డి (బి) (కొత్త) జూనియర్ కళాశాల 160 160  –
  మొత్తం 2160 2024  –

కామారెడ్డి బాలుర మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ 2017-18 విద్య సంవత్సరమంలో విలీనము జరిగినది.

  1. పోస్టుమెట్రిక్ స్కాలర్ షిప్ లు ( రాష్ట్ర ప్రభుత్వము ద్వారా)    (రూపాయలు లక్షలలో)
క్ర.సం సంవత్సరం అన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మంజురైన యం.టి.ఎఫ్ మంజురైన ఆర్.టి.ఎఫ్ రిమార్క్స్
ఫిజికల్ ఫైనాన్సియాల్ ఫిజికల్ ఫైనాన్సియాల్ ఫిజికల్ ఫైనాన్సియాల్
1 2018-19 2122 3347 113.05 1492 95.22
2 2019-20 2333 654 31.75
Total 4455 4001 144.80 1492 95.22

 

  1. సి.యం.ఓవర్సీస్ స్కాలర్షిప్ :                             (రూపాయలు లక్షలలో)

ఇట్టి పదకము తెలంగాణ రాష్ట్రము నందు ప్రభుత్వ ఉత్తర్వ నం.24 & 126 తేది.19.05.2015 ద్వారా పేద మైనారిటి విద్యార్థులకు విదేశాలలో ఉన్నత విద్య అబ్యసించుట కోరను ఉచితముగ ఇరవై లక్షల రూపాయలు మరియు విదేశీ యానానికి ఓక వైపు ప్రయాణ భత్యము కూడ ప్రభుత్వము ఈ పధకము ద్వార మంజూరు చేయుచున్నది. దీని కొరకై దరఖాస్తు దారు యొక్క ఆదాయము రెండు లక్షల లో పై ఉండవలెను మరియు GRE,GMAT,TOFEL,ILETS & PTE లలో ఏదేని రెండు విషయములలో తప్పక ఉత్తిర్ణులై ఉండవలెను.

మంజూరు చేయబడిన ఉపకార వెతనములు: (సి.యం.ఓవర్సీస్ స్కాలర్షిప్)

క్ర.సం సంవత్సరం అన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సెలెక్టెడ్ మంజూరు ఆయన నిధులు విడుదల చేయబడిన నిధులు మిగిలిన నిధులు
1 2018-19 04 3 61.80 56.82 4.98
2 2019-20 02 1 20.30 20.30
3 2020-21 01

 

  1. క్రైస్తవ చర్చీల నిర్మాణము :-ఈ క్రింద చూపిన (2) చర్చీల/చర్చ్ నిర్మాణము కొరకు రూ. 00 లక్షల అంచనాలతో మంజూరు కొరకు ప్రభుత్వమునకు పంపబడినవి.
క్రమ సంఖ్య పని పేరు ప్రదేశము అంచనా విలువ
1 CSI చర్చి సామజిక భవన నిర్మాణము మల్లూర్ గ్రామము మండలము నిజాంసాగర్ 10.00 లక్షల
2 చర్చి భవన నిర్మాణము ఆరేడు గ్రామము నిజాంసాగర్ మండలము 15.00 లక్షల
మొత్తము   25.00

 

  1. క్రైస్తవ చర్చీల ప్రహరి గోడ నిర్మాణము మరియు రిపెర్స్ :-ఈ క్రింద చూపిన (5) చర్చీల ప్రహరి గోడ నిర్మాణము మరియు రిపెర్స్ కొరకు రూ.32.50 లక్షల అంచనాలతో మంజూరు కొరకు ప్రభుత్వమునకు పంపబడినవి.
క్రమ సంఖ్య పని పేరు ప్రదేశము అంచనా విలువ
1 చర్చిల కాంపౌండ్ వాల్ మిగులు పనులు ఎల్లారెడ్డి గ్రామము మరియు మండలము 5.00 లక్షల
2 చర్చిల సమాదుల ప్రహరిగోడ నిర్మాణము ఎల్లారెడ్డి సి.యస్.ఇ గ్రామము మరియు మండలము 3.00 లక్షల
3 చర్చిల కాంపౌండ్ వాల్ నిర్మాణము కొత్త సి.యస్.ఇ ఎల్లారెడ్డి గ్రామము మరియు మండలము 3.00 లక్షల
4 చర్చిల కాంపౌండ్ వాల్ నిర్మాణము రామారెడ్డి గ్రామము మరియు సదాశివనగర్ మండలము 8.00 లక్షల
5 చర్చిల కాంపౌండ్ వాల్ నిర్మాణము అన్నారం గ్రామము మాచారెడ్డి మండలము 13.50 లక్షల
  మొత్తము   32.50   లక్షల

 

  1. క్రైస్తవ మైనారిటీ లకోరకు సామజిక భవన నిర్మాణము:- కామారెడ్డి జిల్లా నందలి ఎల్లారెడ్డి మండలము నందు క్రైస్తవ మైనారిటీ సోదరుల కొరకు సామాజిక భవనము నిర్మించుకొనుటకు గాను ప్రభుత్వము O.Rt.No.47, తేది: 25-01-2017 ద్వార రూ||1,00,00,000/- మంజూరు చేయడం జరిగినది. అట్టి నిధుల నుండి రూ||42,99,000/- ప్రభుత్వము మొదటి విడతగ డబ్బులు కూడా రిలీజు చేయడము జరిగినది. మరయు 10% నిధులు స్థానిక ప్రజల వితరణ (LPC) జమ చేయనవసరము లేదని ప్రభుత్వము ఆదేశించినందున నిర్మాణపు పనుల ప్రక్రియ కొనసాగించ వలసినదిగా మండల పరిషత్ అభివృధి అధికారి ఎల్లారెడ్డి గారికి ఉత్తర్వులు జారి చేయ నైనది.

 

  1. క్రిస్టమస్ ఫిస్ట్: ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేద క్రైస్తవ సోదరులకు క్రిస్టమస్ పండుగల సందర్బంగ క్రిస్టమస్ విందు ఎర్పాటు చేయుచున్నది. కామరెడ్డి జిల్లాలో 2018-19 సంవత్సరంలో క్రైస్తవలకు (4) అసెంబ్లీ నియజక వర్గాలకు 1000 చొ||న మొత్తం 4000 బట్టలు పంపిణి చేయడం జరిగింది. అంతేగకుండా క్రిస్టమస్ ఫిస్ట్ కొరకు ప్రతి నియోజకవర్గం నకు రూ.2,00,000/- ల చొ||న మొత్తం (4) నియాజక వర్గాలకు 8,00,000/- రూపాయలు ఖర్చుచేయడం జరిగినది.
  2. రంజాన్ 2020: ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేద ముస్లిం సోదరులకు రంజాన్ పండుగల సందరభంగ ఇప్తార్ విందు ఎర్పాటు చేయుచున్నది. కామరెడ్డి జిల్లాలో ఈ సంవత్సరంలో ముస్లింలకు (4) అసెంబ్లీ నియజక వర్గాలకు బాన్స్వాడ – 2500, కామారెడ్డి – 2500, జుక్కల్ – 2500, మరియు ఎల్లారెడ్డి – 1500 జనాభా ప్రాతి పదికన నియొజక వర్గంలో గల ఎంపిక చేయబడిన 18 మస్జిద్ లకు ప్రతి ఒక్క దానికి @ 500 ల గిఫ్ట్ ప్యాక్స్ మొత్తం 9,000 బట్టలు పంపిణి చేయడం జరిగినది. మరియు  దావత్ – ఎ – ఇప్తార్ కొరకు రూపాయలు @ 1 లక్ష చొప్పున మొత్తం (4) నియాజక వర్గాలకు 18,00,000/- లక్షల రూపాయలు ఎంపిక చేయబడిన 18 మస్జిద్ కమిటి ద్వార ఖర్చుచేయడం కొరకు ప్రభుత్వము ద్వార మంజూరు చేయడం జరిగినది, మూడు నియొజక వర్గాలకు అనగా కామారెడ్డి, బాన్స్వాడ మరియు జుక్కల్ కు 00, లక్షల చోప్పున మరియు ఎల్లారెడ్డి నియుజక వర్గానికి  3.00, లక్షల రూపాయలు. ఖర్చు చేయడం జరిగింది.
  3. డ్రైవర్స్ ఎంపవర మెంట్ పథకము :- ఈ పథకము ద్వార తెలంగాణా ప్రభుత్వము పేద మరియు డ్రైవింగ్ అర్హత గల నిరుద్యోగ క్రైస్తవ యువకులకు చేయుతనిచ్చేందుకు గాను జిల్లా నందు 8 దరఖాస్తులు ఆన్లైన్ ద్వార వచ్చినవి. అట్టి దరఖాస్తులను జిల్లా కలెక్టర్ గారి ఆమొదము పొంది మంజూరు కొరకు క్రిష్టియన్ మైనారిటీ కార్పొరేషన్ కు పంపనైనది. ఇట్టి పథకము ద్వార (6 ) యూనిట్లు మంజురు చేయడం జరిగినది.
  4. షాది ముబారక్ : ఇట్టి పథకము 2 అక్టోబర్ 2014 నుండి తెలంగాణా రాష్ట్రం నందు అమలు చేయడం జరిగినది. ఈ పథకము ద్వార నిరు పేద మైనారిటీ బాలికలకు వారి వివాహ సమయమందు రు.100116/- (అక్షరాల ఓక లక్ష నూట పదహారు రూపాయలు ) నగదు రూపంలో అందజేయబడును, 2018-19 డివిజన్ ల వారి వివరములు ఈ దిగువన చుపబదినవి.
క్రమ సంఖ్య

 

 

 

 

డివిజన్ల పేరు

దరఖాస్తు చేసిన వారి సంఖ్య తిరస్కరించా బడిన దరఖాస్తుల సంఖ్య తహసిల్దార్ గారి వద్ద పెండింగ్ ఉన్న దరఖాస్తులు తహసిల్దార్ గారి వద్ద పరిశీలించా బడిన దరఖాస్తులు MLA గారి వద్ద అమోదించబడిన మంజూరి కొరకు గల దరఖాస్తులు మంజూరు చేయబడిన బిల్లులు ట్రెజరీ నందు పెండింగ్ ఉన్న దరఖాస్తులు ట్రెజరీ ద్వార అమోదించబడిన బిల్లుల సంఖ్య
1 బన్స్ వాడ 259 2 63 83 32 0 0 79
2 కామారెడ్డి 247 0 34 12 32 0 0 169
3 ఎల్లారెడ్డి 87 1 6 8 15 0 17 49
మొత్తం 593 3 103 103 79 0 17 288

 

ఈ పథకము ప్రస్తుతము జిల్లా మైనారిటీ వెల్ఫేర్ కార్యాలయము నుండి జి.ఓ.100 ప్రకారము తహసిల్దార్లకు ఇవ్వనైనది మరియు జి.ఓ.107 ప్రకారము రెవెన్యు డివిజన్ అధికారులకు చెక్కులు తయారు చేయుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేయనైనది. ప్రస్తుతము ఇట్టి పథకము జిల్లా మైనారిటీ కార్యాలయము నుండి తిసివేయనైనది.

డ్రైవర్స్ ఎంపవర మెంట్ పథకము 2018-19 ఈ పథకము ద్వార తెలంగాణా ప్రభుత్వము పేద మరియు డ్రైవింగ్ అర్హత గల నిరుద్యోగ ముస్లిం యువకులకు చేయుతనిచ్చేందుకు గాను కామారెడ్డి జిల్లాకు 7 యూనిట్లు మంజూరు చేయడం జరిగినది. ఆన్లైన్ ద్వార 409 మంది దరఖాస్తులు చేస్కున్నారు.

  • తెలంగాణ మైనారిటీల నివాస విద్యా సంస్థ సొసైటీ పాఠశాలలు.
  • బ్యాంకింగ్ సబ్సిడీ పథకం.
  • గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రీ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు
  • రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు
  • ముఖ్యమంత్రి విదేశీ స్కాలర్‌షిప్ పథకం.
  • వక్ఫ్ / మైనారిటీ సంస్థలకు సహాయం.
  • చర్చిలకు ఆర్ధిక సహాయం.
  • నైపుణ్య అభివృద్ధి.
  • స్టడీ సర్కిల్.
  • డ్రైవర్ సాధికారత పథకం.
  • గుడుంబా ప్రభావిత వ్యక్తుల పునరావాస ఆర్థిక సహాయం మంజూరు చేసింది.

తెలంగాణ మైనారిటీల ఆర్థిక సంస్థ వెబ్‌సైట్ : http://tsmfc.telangana.gov.in/

కామారెడ్డి జిల్లా కార్యాలయ సిబ్బంది:

క్రమ

సంఖ్య

శీర్షిక పేరు లింగం మ/స్త్రీ హోదా మొబైల్ నెంబర్ ఇమెయిల్
1 శ్రీ టి.దయానంద్ స్త్రీ
జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి
9959205332 dmwo-kmr-mw[at]telangana[dot]gov[dot]in
2 శ్రీ
కేతవత్ కిషన్
సూపరింటెండెంట్
9010933693 supdt-kmr-mw[at]telangana[dot]gov[dot]in
3 శ్రీ
షేక్ మొయిజ్ ఉద్దీన్
ఉర్దూ ఆఫీసర్ గ్రేడ్ II
9010261667 urduofficer-kmr-mw[at]telangana[dot]gov[dot]in
4 శ్రీ
మహ్మద్ ఇక్రమ్ ఖాన్
 
డేటా ఎంట్రీ ఆపరేటర్ 1
8096973346 deo1-kmr-mw[at]telangana[dot]gov[dot]in
5 శ్రీ
మహ్మద్ ఇర్ఫాన్
డేటా ఎంట్రీ ఆపరేటర్ 2
 
9912244005 deo2-kmr-mw[at]telangana[dot]gov[dot]in
మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాప్, కామారెడ్డి జిల్లా

మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాప్