ముగించు

కామారెడ్డి రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోత్సవలలో భాగంగా RTA ఆఫీస్ నందు ఊచిత కంటి పరీక్షలు మరియు రక్త దాన శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది.

06/01/2025 - 06/02/2025
కామారెడ్డి

కామారెడ్డి రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోత్సవలలో భాగంగా సోమవారం జనవరి 6 న RTA ఆఫీస్, నరసన్నపల్లి నందు ఊచిత కంటి పరీక్షలు మరియు రక్త దాన శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది. ఇట్టి అవగాహనా కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస రెడ్డి గారు ప్రసంగిస్తూ కంటి పరీక్షలు విధిగా చేసుకోవాలి అని కార్యక్రమంలో పాల్గొన్న డ్రైవర్లు మరియు సాధారణ పౌరులని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ఇ కార్యక్రమంలో ఉత్సాహంగా పదుల సంఖ్యలో కంటి పరీక్షలు చేయించుకున్నారు మరియు రక్త దానం చేసినవారికి ప్రశంస పత్రాలు అందచేశారు.మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ నాగలక్ష్మి గారు కార్యక్రమ నిర్వహణకి సహకరించిన వైద్య బృందానికి మరియు రవాణా శాఖ సిబ్బంది కి ధన్యవాదములు తెలిపారు.మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ అఫ్రోజుద్దీన్ గారు రోడ్డు భద్రత మాసోత్సవాళ్ళో భాగంగా అభ్యుదయ పాఠశాల,దోమకొండ లొ అవగాహనా కలిపించారు మరియు ఆటో డ్రైవర్స్ విధివిధనలు , నియమాలతో కూడిన ప్రతిజ్ఞ చేయించారు.

రవాణా శాఖ అవగాహనా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న తిరునిచూసి పలువురు ప్రజాప్రతినిధులు మరియు పౌరులు హర్షించారు.